అన్నం తినే వాళ్లయితే... వైసీపీతో లబ్ది పొంది ఇతర పార్టీలకు ఓటు వేయరు: ధర్మవరం ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

  • వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసినా పథకాలు అందిస్తున్నామన్న కేతిరెడ్డి
  • పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వ్యాఖ్య
  • జగన్ ను ఎదుర్కోడానికి ఎంత మంది వచ్చినా ఏమీ చేయలేరని ధీమా
ఓటర్లపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ‘అమ్మ ఒడి’ లబ్దిదారులతో ఎమ్మెల్యే ర్యాలీ నిర్వహించారు. తర్వాత పొట్టి శ్రీరాములు సర్కిల్‌లో మాట్లాడారు. 

ప్రతి ఒక్కరూ వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్దిపొందారని అన్నారు. అన్నం తినే వారు ఎవరైనా.. వైసీపీ ద్వారా సాయం పొంది ఇతర పార్టీలకు ఓటు వేయరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ రోజు ఎవడైనా కానీ.. నాకు నష్టం చేసినా, వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసినా.. వాళ్లందరికీ పథకాలు అందిస్తున్నాం. అన్నం తినే ఏ నా కొడుకూ కూడా... వైసీపీ నుంచి సాయం పొంది పక్కకు పోడు” అని అన్నారు. పార్టీలకు అతీతంగా వైసీపీ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు.  జగన్ ను ఎదుర్కోడానికి ఎంత మంది వచ్చినా ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.

Kethireddy Venkatrami Reddy
YSRCP
dharmavaram

More Telugu News